ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదన్నదని అన్నారు.
నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటారని కుండబద్దలగొట్టినట్టు చెప్పారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారని బలంగా నమ్ముతున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో లబ్దిపొంది ఉన్నారని తెలిపారు.

