భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసి విద్యా దీవెన పథకం కింద రూ. 584 కోట్లు రిలీస్ చేసారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… జులై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి మొత్తం 8,09,039 మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు ఈ మొత్తాన్ని విడుదల చేశామన్నారు.
విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ. 4,275 కోట్లు రీయింబర్స్ చేయడం జరిగిందని అన్నారు. దాదాపు 27.61 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం జరిగిందని ఆయన వాళ్లడించారు. ఈ పథకాల కింద ప్రభుత్వం రూ.18,576 కోట్లు వెచ్చించిందన్నారు. గత టీ.డీ.పీ. హయాంలో పెండింగ్లో ఉన్న రూ.1,777 కోట్ల బకాయిలను కూడా మాఫీ చేశామన్నారు.
