చౌటుప్పల పట్టణ కేంద్రంలోని రెండవ రోజు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యం తిరిగి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం ఆరు సంక్షేమపథకాల అమలుకు రెండవ రోజు శ్రీకారం చుట్టడం జరిగినది అన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందనడానికి నిదర్శనంగా 6 గ్యారెంటీల పథకాలకు దరఖాస్తులు తీసుకుంటున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, పేదవారికి వైద్యం కోసం 10 లక్షల రూపాయలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అమలుచేస్తున్నారన్నారు.
చౌటుప్పల పట్టణంలో 2 రోజు ప్రజా పాలన కార్యక్రమం…

