తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ మండలంలో ఒక చెరువులో యువకుడు పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృత దేహాన్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. మృతి చెందిన వ్యక్తి వడిసలేరు గ్రామానికి చెందిన 30 ఏళ్ల కట్ట రాంబాబు గా గుర్తించారని ఎస్సై నాగరాజు అన్నారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చెరువులో దూకిన యువకుడు… చివరికి…???

