చెన్నైలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ని చెన్నై శివార్లలో హత్యచేసారు. నందిని అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్ననాటి స్నేహితురాలు, ట్రాన్స్ పర్సన్ గొలుసులతో బంధించి, నరికి, సజీవ దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలును గొలుసులు కట్టి, మణికట్టు, కాళ్లు, మెడపై ఆమె స్నేహితురాలు వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి బ్లేడ్తో కోసి శనివారం అర్థరాత్రి నిప్పంటించాడని పోలీసులు విచారణలో తెలిపారు.
నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.పోలిసు వివరల ప్రకారం… నందిని తనకు దూరమై ఇతరులతో సన్నిహితంగా మెలగడం పట్ల వెట్రిమారన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బర్త్ డే సర్ ప్రైజ్ ఇస్తానన్న నెపంతో నందినిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు.

