డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు యస్.పి. యస్. శ్రీధర్ అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున పోగొట్టుకున్న ఫోన్లు బాధితులకు అందజేసే నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడం జరుగుతుందన్నారు.
CHAT BOT సేవలు ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే దశల వారీగా రికవరీ …
1) 06.03.2023 వ తేదిన 85 ఫోన్లు, విలువ సుమారుగా రూ. 15,39,000/-
2) 26.04.2023 వ తేదిన 168 ఫోన్లు, విలువ సుమారుగా రూ. 26,50,000/-
3) 10.06.2023 వ తేదిన 145 ఫోన్లు, విలువ సుమారుగా రూ. 22,00,000/-
4) 21.10.2023 వ తేదిన 106 ఫోన్లు, విలువ సుమారుగా రూ. 17,24,000/-
5) 09.02.2024 వ తేదిన 170 ఫోన్లు, విలువ సుమారుగా రూ. 26,62,000/-
మొబైల్ ఫోన్లను రికవరీ చేసి భాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారికి తక్కువ వ్యవధిలోనే తిరిగి వారి ఫోన్లు వారి చేతికందడం జరిగింది. CHAT BOT సేవలు ప్రారంబించిన తర్వాత అత్యదిక మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు.
చాట్ బాట్ తో మొబైల్ ఫోన్లు రికవరీ…
