గత ప్రభుత్వంలో గ్రూప్ 2 కు 1:100 అమలు చేసి, గ్రూప్-1 అభ్యర్థులను ఇబ్బంది పెట్టిన నిరుద్యోగ యువతకు న్యాయం కోరుతూ.. గ్రూప్-1 ఎంపిక విధానం 1:100గా మరల ప్రకటించాలని, స్థానిక ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కి ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ వినతి పత్రాన్ని అందించారు. 2023 జనవరి 22న జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష అనంతరం ,మిగతా పరీక్షలు కు ఉన్న న్యాయపరమైన సమస్యలను తొలగించి, అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన అన్ని ప్రభుత్వ అకాడమీ పుస్తకాలను అందుబాటులోకి తేవాలని కోరారు.
గ్రూప్-1 ఎంపిక విధానం పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ కు లేఖ…

