కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్రి గ్రామంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక గ్రామంలో జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులు పోటీలు, భోగి మంటలు, అందరిని అలరించాయి.
ఈ సందర్బంగా ఉదయ్ మాట్లాడుతూ… అందరు కుటుంబాల్లతో సంతోషంగా గడపాలని అన్నారు. వచ్చేఎన్నికల్లో జనసేన, టీ.డీ.పీ. కలిసి అధికారంలో వచ్చే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. ఈ పోటీల్లో విజేటలకు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందచేసారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

