కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యలయ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు, తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జీ వర్మ, భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ బుర్రా వరుణ్ కృష్ణంరాజ్ హాజరయ్యి ఆ కార్యలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా పీటీ చేస్తున్నారని ఆయన్ని గెలిపించుకుంటే కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జే.ఎస్.పీ. నాయకులు, టీ.డీ.పీ. పార్టీ నాయకులు, బీ.జే.పీ. నాయకులు, కార్యకర్తలు విచ్చేసారురు.

