నమాజ్ చేస్తున్నప్పుడు వారిపై దాడి జరిగినట్లు ప్రాథమిక నివేదిక తెలిపింది. అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్శిటీ అంతర్జాతీయ బాలుర హాస్టల్లో రంజాన్ సందర్భంగా నమాజ్ చేస్తున్నందుకు శనివారం అర్థరాత్రి ఒక గుంపు దాడి చేయడంతో నలుగురు విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్సపొంవుతున్నారని వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు.
ఘటన గురించి తెలుసుకున్న అహ్మదాబాద్ పోలీస్ చీఫ్ జీ.ఎస్. మల్లిక్, గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నీర్జా గుప్తా ఆదివారం ఉదయం హాస్టల్కు చేరుకున్నారు. సందర్శన అనంతరం పోలీసు కమిషనర్ మాలిక్ మాట్లాడుతూ… రాత్రి 10.30 గంటల ప్రాంతంలో విదేశీ విద్యార్థులు నమాజ్ చేస్తున్నప్పుడు 20-25 మంది ప్రజలు అక్కడ ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారని అడిగారని, మసీదులో అలా చేయమని చెప్పారని చెప్పారు. దీంతో హాస్టల్ గదుల్లో కూడా తోపులాట, రాళ్లదాడి, విధ్వంసానికి దారితీసిందని తెలిపారు.
