పీ. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది కార్యక్రమంలో నిరశన తెలియజేశారు. మండల తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయకర్త మద్దా చంటిబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్ ఈ నిరశన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్తేశ్వరం నుండి కే జగన్నాధపురం వరకూ, అయినవిల్లి నుండి మడుపల్లి వరకూ ఆర్ అండ్ బి రోడ్డులోని గుంతలను పూడ్చి రహదారిని నిర్మించాలని డిమాండ్ చేశారు.
గుంతల రోడ్డులో వరినాట్లు వేసి నిరశన…

