కాకినాడ జిల్లా కొవ్వూరు గ్రామంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. ఆ గ్రామానికి చెందిన వై.సీ.పీ. సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు వై.సీ.పీ. 7వ వార్డు మెంబర్ రెడ్డి ముసలయ్య, 13వ వార్డు మెంబర్ కాకి ముసలయ్య మరియు ఆ పార్టీకి చెందిన గ్రామ పెద్దలు, యువకులు సుమారు 100 మంది కొవ్వూరు రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ సమక్షంలో చేరారు. జనసేన పార్టీ సిద్దాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీ.డీ.పి., బీ.జే.పీ. పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు అలియాస్ నానాజీ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ… వై.సీ.పీ. పార్టీలో కార్యకర్తకు సరైన గుర్తింపు లేదని, యువతకు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో సముచితమైన స్థానం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు గ్రామ ప్రజలు, టీ.డీ.పి. నాయకులు పాల్గొన్నారు.
కొవ్వూరు గ్రామంలో జనసేనా పార్టీలో బారీ చేరికలు…

