కేరళా రాష్ట్రంలోని పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో మంగళవారం వరకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీనితో కేరళ అప్రమత్తమైంది. ఈ జిల్లాల్లో 204.4 మి.మీ కంటే ఎక్కువ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తిరువనంతపురం, కొల్లం, ఎర్నాకులం జిల్లాల్లో బుధవారం వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో బుధవారం వరకు 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెళ్లడించింది. బుధవారం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐ.ఎం.డీ. అంచనా వేసింది.
కేరళలో నాలుగు జిల్లాలకు ఐ.ఎం.డీ. రెడ్ అలర్ట్…
