సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి అధ్యక్షతన ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో అంగన్వాడీల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానించారు. చట్టబద్ధంగా పోరాడే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించి జగన్ ప్రభుత్వం తన భయాన్ని బయట పెట్టుకుందని కేంద్ర కార్మిక సంఘాలు ఎస్మా ప్రతులను అంగన్వాడీ దీక్షా శిబిరంవద్ద ధగ్నం చేశారు.
ఈ సందర్భంగా టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, సీపీఎం జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్,తదితరులు మాట్లాడుతూ… తెలంగాణా కంటే వెయ్యి అదనంగా చెల్లిస్తానని అంగన్వాడీలకు జగన్ ఇచ్చిన మాటను అమలు చేయాలని కోరుతూ గత 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఆడపడుచులపట్ల నిర్బంధాన్ని ప్రయోగించేందుకు ఎస్మా చట్టాన్ని జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, తక్షణం అంగన్వాడీలపై విధించిన ఎస్మాని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

