నల్గొండ జిల్లా లో భువనగురి నియోజకవర్గంలో భువనగిరి కాంగ్రెస్ శాసనస భ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను వలిగొండ మండల కేంద్రా నికి చెందిన జిల్లా మైనార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ రావుప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా టేకుల సోమవారం గ్రామంలోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో కేకు కటిం నిర్వహించారు. మహమ్మద్ అబ్దుల్ రావుప్ మాట్లాడుతూ… ఇటువంటి జన్మదిన వేడుకలను మునుముందు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు. అనంతరం వికలాంగులకు బిస్కెట్లు, పండ్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గౌడ్ మైనార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ సమద్, ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారగొని శ్రీనివాస్, గౌడ్ షారాజు కిష్టయ్య, మామిడి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడులలో మహమ్మద్ అబ్దుల్ రావుప్…

