అచ్చంపేట సెంటర్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న తోటలో బీ.సీ. ఎంప్లాయిస్ సమాఖ్య కాకినాడ జిల్లా శాఖ ఏర్పాటు కార్తిక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీ.సీ. మున్సిపల్ కమిషనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నిరంతరం విధులు నిర్వహించే ఉద్యోగులు ఒత్తిడి నుండి బయటపడేందుకు కార్తీక సమారాధన వంటి సామాజిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. బీసీ పిల్లలకు విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పన దిశగా బీ.సీ. ఎంప్లాయిస్ సమైక్య కృషి చేయాలని అందుకుగాను తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాదా వెంకటరమణ, డాక్టర్ వరప్రసాద్, పలువురు ఇతర జిల్లాల ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కార్తీక సమారాధనలో కమిషనర్ నరసింహారావు…

