News

కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వాస్తు మార్పులు

శాస్త్ర సాంకేతికత ఎంతపెరిగినా … నాటు వైద్యం … భూత వైద్యం… భాణామతి… మూడనమ్మకాలు ఇంకా ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇందులోంచి బయటపడలేకపోతోంది. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కాలికి దెబ్బ తగలడంతో డిఎంహెచ్‌ఒ కార్యాలయానికి వాస్తుదోషం ఉందని తేల్చేశారు. కార్యాలయంలో మార్పులు చేర్పులు మొదలయ్యాయి. మొదటి అంతస్తులో ఉండే డిఎంహెచ్‌ఒ గ్రౌండ్‌ఫ్లోర్‌కి దిగిపోయారు. జిల్లా ఇమ్యునేజేషన్‌ అధికారి (డిఐఒ) గదిని డిఎంహెచ్‌ఒ ఛాంబర్‌గా మార్చేశారు.

వాస్తు దోషం పేరుతో ఈ కార్యాలయంలోని లిఫ్ట్‌ను మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేకసార్లు వాస్తు పేరుతో గోడలు కూల్చివేసి, కొత్త నిర్మాణాలు జరిపారు. గేట్లు మూసివేశారు, మరలా తెరిచారు. డిఎంహెచ్‌ఒ కార్యాలయం చుట్టూ అనారోగ్యకర పరిస్థితులున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోడం చర్చానీయాంశంగా మారింది.

Avatar

Spy News

About Author

2 Comments

  1. Avatar

    A P J Vinu

    7 November 2023

    This is blind belief

    • Avatar

      Spy News

      7 November 2023

      Thanks for your comment

Comments are closed.

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం