Political

కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి అభ్యర్ధులను తెలిపించాలి…

WhatsApp Image 2024-04-28 at 9.28.03 AM

రాష్ట్రంలో కూటమి పార్టీలు ప్రకటించిన హామీల అమలు సాధ్యం కాదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతిని నిరోధించి, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించే హామీలు అమలు సాధ్యమేనని ఆయన అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రూ. 41వేల కోట్లు పక్కదాని పట్టించారని ఆరోపించారు. ఇసుకలో వేలకోట్లు మింగేశారని, వాలంటీర్లకు సన్మానాలు పేరుతో రూ. 705 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి రూ. 13 వందల కోట్లు ఆ రంగులు తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు చేశారని అన్నారు. చిన్న పిల్లల చిక్కీల్లో కూడా రూ. 61 కోట్లు దోచుకున్నారని అన్నారు. విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్ ల్లో రూ. 212 కోట్లు అవినీతి జరిగిందని, ఇలాంటివన్నీ అరికడితే హామీలు అమలు పెద్ద కష్టం కాదని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.