రాష్ట్రంలో కూటమి పార్టీలు ప్రకటించిన హామీల అమలు సాధ్యం కాదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతిని నిరోధించి, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించే హామీలు అమలు సాధ్యమేనని ఆయన అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రూ. 41వేల కోట్లు పక్కదాని పట్టించారని ఆరోపించారు. ఇసుకలో వేలకోట్లు మింగేశారని, వాలంటీర్లకు సన్మానాలు పేరుతో రూ. 705 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి రూ. 13 వందల కోట్లు ఆ రంగులు తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు చేశారని అన్నారు. చిన్న పిల్లల చిక్కీల్లో కూడా రూ. 61 కోట్లు దోచుకున్నారని అన్నారు. విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్ ల్లో రూ. 212 కోట్లు అవినీతి జరిగిందని, ఇలాంటివన్నీ అరికడితే హామీలు అమలు పెద్ద కష్టం కాదని అన్నారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి అభ్యర్ధులను తెలిపించాలి…

