కాకినాడ నగరంలో సూర్యారావుపేటలో దూసర్లపూడి వారివీధిలో 2008 జనవరి 14న స్వయంభువుగా భోగిమంటల్లో వెలిసి కాంస్య కవచంలో కొలువైన కాకినాడ భోగిగణపతికి వార్షిక భారీ అన్న సంతర్పణను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది భోగి మంటల్లో నిలిపిన 6అడుగుల రావి మాను దుంగ నుండి కుడిపాదం చెంత మూషికంతో వక్రతుండ విఘ్నేశ్వర స్వరూపం స్వయంభువుగా అగ్నిహోత్రంలో వెలసి విశేష స్థల పురాణ చరిత్రతో భోగి గణపతి పీఠం ఆధ్యాత్మిక దర్శినిగా భక్త జనుల ఆరాధనతో ప్రసిద్ది చెందింది. ఈ సందర్బంగా జనవరి 14న ఆదివారం భోగి పండుగ సందర్భంగా గోవుపిడకలతో భోగి మంట వేసి పీఠం 17వ వార్షికోత్సవంగా భారీ అన్నసంతర్పణ నిర్వహిస్తున్నారు. ఈ అన్న సంతర్పణకు అందరు భక్తులు విచ్చేసి భోగిగణపతిని దర్శించుకోవల్సిందిగా ఆలయ కమిటీ పిలుపునిచ్చారు.
కాకినాడ భోగిగణపతి పీఠంలో 17వ వార్షిక భారీ అన్న సంతర్పణ…

