కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా జె. వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన పార్వతిపురం మన్యం జిల్లా లో జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. పూర్తి అదనపు బాధ్యతలతో కమిషనర్ గా పనిచేస్తున్న సి.హెచ్. నాగ నరసింహ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
కాకినాడ కొత్త కమిషనర్ గా జె. వెంకటరావు నియామకం…

