కాకినాడ లో ముడు రోజులు డిసెంబర్ 28,29,30 తేదీ లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రికి కాకినాడ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకుగాను ఆ పార్టీ వర్గాలు అచ్చంపేట జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియచేసారు. ఆయన ఈ రోజు రాత్రికి విద్యుత్ నగర్లో గెస్ట్ హౌస్ లో బస చేయనున్నట్లు సమాచారం.
