ఈ నెల 29వ తేదీన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కాకినాడను పర్యటించనున్నారని జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాకినాడ జిల్లా ఇన్చార్జ్ కోడూరి లక్ష్మీనారాయణ తెలిపారు. 2024 లో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు ఆమె దిశా నిర్దేశం చేయనున్నట్టు ఆయన అన్నారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్, మీడియా ప్యానలిస్ట్ శ్రీ దువ్వూరు సుబ్రహ్మణ్యం తో కలిసి శ్రీ కోడూరి లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆమె బాధ్యతలు చేపట్టిన తురవాత తొలిసారిగా కాకినాడ వస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా శక్తి కేంద్ర ఇన్చార్జిలతో సమావేశం కానున్నారని వెళ్లడించారు.
కాకినాడకు రానున్న బీ.జే.పీ. అధ్యక్షురాలు పురందేశ్వరి… -కోడూరి-

