కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకడుతుందని ప్రజలు ఆశతో కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాష్ట్ర కాగ్రెస్ ఉపాధ్యక్షుడు ముషిణి రామకృష్ణారావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని ఆయన అన్నారు. కొత్తపేట అసెంబ్లీ నియోజక వర్గంలో గతవారం రోజులుగా ఇంటింటా కాంగ్రెస్ పేరున కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ప్రజలను స్వయంగా కలసి వచ్చే ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.
2019 ఎన్నికల్లో తాను కొత్తపేటనుడి పోటిచేశింనందువలన ప్రజలతో మమేకమయ్యానని అన్నారు. కాంగ్రెస్ పార్టి అధిష్టానం ఆదేశిస్తే ఈ సారి కూడా తప్పక కొత్తపేటనియోజక వర్గం నుడి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 43 సంవత్సరాలనుంచి కాగ్రెస్ పార్టికి అంకితభావంతో అలుపెరుగని సైనికుడిలా సేవలందిస్తున్నానని ఈ విషయం ప్రజలందరూ కూడా గుర్తించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పి. ఉదయ భాస్కర వర్మ, కాంగ్రెస్ నాయకులు ఎన్. నాగేశ్వరరావు, సలాది వెంకటానందం, మేడిశెట్టి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

