భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎం.పీ. బండి సంజయ్ కుమార్ రైతుల కోసం రేపు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని అన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడంలేదని పంటల బీమాపథకాన్ని అమలు చేయలేదని చెప్పారు. అందువలన మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆధ్వర్యంలో రైతు దీక్ష చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ దీక్షలో బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో బండి సంజయ్ రైతు దీక్ష…
