డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా లో కపిలేశ్వరపురం మండలం వల్లూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని అంగరంఘ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలత ఎమ్మెల్యేను టీ.డీ.పీ. కార్యకర్తలు, జనసేన ఇన్చార్జి లీలా కృష్ణ ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆనయ అందరితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ ఇంటికి వెళ్లి నారా చంద్రబాబు ఎందుకు రావాలో వివరిస్తూ తెలుగు దేశం, జనసేన పార్టీ కలిసి ప్రచురించిన మినీ మేని ఫస్టో కరపత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును తిరిగి ముఖ్య మంత్రిని చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, జనసేన ఇన్చార్జి, టీ.డీ.పీ., జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
కపిలేశ్వరపురం మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం…

