నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన పలువురు వై.సీ.పీ. నేతలు జనసేన పార్టీలోకి స్వచందంగా చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో పార్టీ కండువాలు స్వీకరించి జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియజ్ నేతృత్వంలో పిఠాపురంలో నాగబాబు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాల్యాద్రి, కృష్ణ, మధు, వెంకటేశ్వర్లు, మాలకొండయ్య, వసంతరావు, బాలకృష్ణ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అలాగే కాకినాడకు చెందిన ఉడతల చక్రీ, వై. శ్రీనివాస్, నాగబాబు, నాని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
కందుకూరులో వై.సీ.పీ. కి బారీ షాక్…

