తూరంగి గ్రామంలో మనందరం కలవాలి చంద్రన్నకు అండగా నిలవాలి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. పిల్లి అనంత లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ ను ఓటు అనే ఆయుధంతో ఓడించాలని అన్నారు. ఇంటింటి కి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకే ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో వివరిస్తూ టీ.డీ.పీ. జనసేన అధినేతలు ఉమ్మడిగా ప్రకటించిన మినీ మేని ఫెస్టో కర పత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కరప మాజీ ఎం.పీ.పీ. గుల్లిపల్లి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ చార్జ్ మిరపల సూర్య ప్రకాష్, తూరంగి గ్రామ కమిటీ అధ్యక్షులు జక్కే అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
ఏ.పీ. కి చంద్రబాబే ఎందుకు కావాలి!!! -మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ-

