ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.సీ.పీ. పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద నూతన ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనుందని వెల్లడించింది. ఇందులో భాగంగా కొత్త కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభింస్తారని తెలిపింది. ప్రతీ ఇంటికీ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది వెళ్లి ప్రజలకు కార్డలను అందించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పై అవగాహన కల్పించనున్నట్లు రాష్ట్రం ప్రభుత్వం తెలిపింది.

