అచ్చుతాపురంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా జరుగుగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఎస్.ఈ.జెడ్. బాధితులతో లోకేష్ భేటీ అయ్యారు. లోకేశ్ మాట్లాడుతూ… టీ.డీ.పీ. హయాంలో విశాఖలో ఐ.టీ. ని అభివృద్ధి చేశామని టీ.డీ.పీ. ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయని అన్నారు.
కాని వై.సీ.పీ వచ్చాకా రాష్ట్రంలో అభివృద్ధి లేదని వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో పడిందన్నారు. బంగాళదుంపకి ఉల్లిగడ్డకి తేడా తెలియని వారు ఇప్పుడు సీ.ఎం.గా ఉంటే అభివృద్ది ఎలా అవుతుందన్నారు. యువగళం పాదయాత్ర అనంతరం అన్ని నియోజక వర్గాలలో పర్యటించి ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెడతామని అన్నారు.

