మత్స్యకార జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బుద్ధి చెప్పాలని అలాగే నగరంలో ఉన్న అర్హులైన మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందించాలని జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం డిమాండ్ చేసింది. స్థానిక సినిమా రోడ్డు లో ఉన్న ఒక ప్రైవేటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మత్స్యకార వికాస విభాగ సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు అధ్యక్షతన జరిగింది.
ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి…!!!

