ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని రాజ్యసభ ఎంపీ ప్రధాని మోదీపై పోల్ ప్యానెల్కు ఫిర్యాదు చేశారు. నరేంద్ర మోదీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని రాజ్యసభ ఎం.పీ. సాకేత్ గోఖలే ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ర్యాలీకి హాజరయ్యేందుకు భారత వైమానిక దళం హెలికాప్టర్ను ఉపయోగించి నియమావళిని ఉల్లంఘించారని రాజ్యసభ సభ్యుడు పేర్కొన్నారు. ఈ.సి. నియమాలు ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడాన్ని నిషేధించాయి. ఈ కారణంగానే 1975లో ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించారని అన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన సందర్భంగా స్పష్టం చేసింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘపై ప్రధాని మోదీపై పోల్ ప్యానెల్కు ఫిర్యాదు…

