జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనందరిపై పెట్టిన బాధ్యతకు అనుగుణంగా పని చేసి ఉత్తరాంధ్ర మొత్తంలో జనసేన పార్టీ పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా సమష్టిగా పని చేయాలని ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో పని చేస్తున్న పార్టీ ప్రతినిధులు, జన సైనికులు, వీర మహిళలు, ఇంకా జనసేన మద్దతుదారులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
అందరి అమూల్యమైన సలహాలు, సహకారంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేద్దామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా పని చేద్దాం. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలు, పార్టీ ప్రణాళికలకు అనుగుణంగా ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

