కేరళలో జరిగిన మాక్పోల్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ఈ.వీ.ఎం. లో బీ.జే.పీ. కి అనుకూలంగా అదనపు ఓట్లు నమోదయ్యాయన్న ఆరోపణపై విచారణ జరిపించాలని ఏప్రిల్ 18న సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. EVMలతో VVPATలను 100% క్రాస్ వెరిఫికేషన్ కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని ఇది తిరిగి ప్రారంభించింది.
లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్.డి.ఎఫ్., యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యు.డి.ఎఫ్. రెండూ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు చేశాయని మనోరమ ఆన్లైన్ ప్రచురించిన నివేదిక తెలిపింది. కనీసం నాలుగు ఈ.వీ.ఎం.లలో బీ.జే.పీ. కి అనుకూలంగా అదనపు ఓట్లు నమోదయ్యాయని తెలిపింది. కేరళలోని కాసర్గోడ్ నియోజకవర్గంలో ఈ.వీ.ఎం. లపై నిర్వహించిన మాక్ పోల్స్పై వచ్చిన ఫిర్యాదులపై వచ్చిన నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఉదహరించారు.

