ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తే తాము ఉపాధి కోల్పోతామని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్ర ఆటోవాలా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ లో ఇటువంటి పధకం ప్రవేశపెడితే తమ పరిస్థితి కూడా ఆగమ్యగోచరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఆటో నడపడం తప్ప వేరే పని తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు వినతిపత్రం అందజేసామని ఫలితం మాత్రం శూన్యమని ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. రాష్ట్ర సీ.ఎం. ఉచిత బస్సు ప్రయాణం పై పునరఆలోచన చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెపుతామని హెచ్చరించారు.
ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణ పథకాన్ని రద్ధు చేయాలి…
