కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సి.ఎల్. రోడ్డు భవాని నగర్ లో ఉన్న కాపు కళ్యాణ మండపం ఆవరణలో కాపు ఆత్మీయ సమారాధన కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ ఉదయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు వెల్లడించారు. స్థానిక సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి దాసు స్వగృహంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా వాసిరెడ్డి మాట్లాడుతూ… కార్తీక మాసంలో జరగవలసిన కాపు వన సమారాధన తుఫాన్ కారణంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. అందువల్ల ఈ నెల 24వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్ మాట్లాడుతూ… కాపు, తెలగా, బలిజ, ఒంటరి, కాపు సోదర సోదరీమణులు కుటుంబ సమేతంగా ఈ ఆత్మీయ వన భోజన మహోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు .

