ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో నివాళులర్పించి, అనంతరం కుటుంబీకులను తెలంగాణ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎం.ఎల్.ఏ. కే.టీ.ఆర్. పరామర్శించారు. వారికి తక్షణ సాయం కింద పార్టీ తరఫున 50వేల రూపాయలు ఆర్ధిక సాయాన్ని కుటుంబానికి అందించి నేనున్నానని భరోసానిచ్చారు. నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించి కలెక్టర్ అనురాగ్ జయంతి తో మాట్లాడారు.
ఆత్మహత్య చేసుకున్న లక్ష్మినారాయణ కుటుంబానికి కే.టీ.ఆర్. ఆర్దిక సాయం…

