ఏ.పీ. రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 60వేల ఉపాద్యాయ ఖాళీలు ఉండగా వీటి భర్తీపై ఎటువంటి చర్యలు వహించని రాష్ట్ర ప్రభుత్వం వీ.ఓ.ఎ.ఆర్.పీ. మధ్యాహ్న భోజన కార్మికులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆశా వర్కర్లు అంగన్ వాడీ స్థానిక ప్రభుత్వ రంగాల్లో పని చేసే కార్మికులను ఉద్దే శ్యపూర్వకంగా తొలగించడం కొత్త వారిని నియమించుకోవడం చేసే పద్ధతులు చట్టబద్ధత లేని రాజకీయ అక్రమాలుగా ఉన్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొం ది.
రాజకీయ పదవుల తరహాలో నియామకాలు చేసుకోవాలనుకోవడం జుగుప్సాకరంగా వుందన్నారు. కార్మికుల సర్వీస్ కండిషన్లను విస్మరించి వారి జీవితాలతో చెలగాటం ఆడటం తగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ తొలగింపులు ఆపాలని.. యధావిధిగా నిర్వహణలో భాగస్వామ్యులను చేయాలని లేకుంటే ప్రజలు ప్రజాస్వామ్య వాదుల వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వుంటుందని దూసర్ల పూడి రమణరాజు పేర్కొన్నారు.

