సామర్లకోట రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ పాయింట్స్ మాన్ గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ సింగ్ కు సీనియర్ పాయింట్స్ మాన్ గా పదోన్నత స్థాయిని దక్కించుకున్నారు. దానితో పాటు భీమవరం స్టేషన్ కు బదిలీ చేసారు. ఆయన్ని స్టేషన్ మేనేజర్ కార్యాలయం లో ఘనంగా సత్కరించి సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సంద్భంగా స్టేషన్ మేనేజర్ ఎం. రమేష్ మాట్లాడుతూ… విధి నిర్వహణ లో అంకిత భావంతో పనిచేస్తే తప్పకుండా అందరికీ ప్రమోషన్ లు వస్తాయని అలాగే బదిలీ అయిన ప్రదేశంలో కూడా విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి రైల్వేల అభివృద్ధికి తన వంతు కర్తవ్యం గా కృషి చేయాలని సూచించారు.
అసిస్టెంట్ పాయింట్స్ మాన్ రాజేష్ కు పదోన్నత స్థాయి…

