అరాచక పాలన పోరాటమే లక్ష్యం గా తెలుగుదేశం, జనసేన పార్టీ లు కలిసి పోరాటం చేస్తున్నట్లు తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంది జనసేన టీడీపీ నాయకులు తెలియజేశారు. స్థానిక హోటల్ లో జనసేన పార్టీ తరపున కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్, పెద్దాపురం ఇన్చార్జ్ తుమ్మల బాబు, టీడీపీ తరపున జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సీటీ ఇన్చార్జ్ వనమాడి కొండబాబు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… తమ నాయకుడు చంద్రబాబు అక్రమ అరెస్టు కు ముందే జనసేన, టీడీపీ కలిసి అరాచక పాలన పై పోరాటం చేస్తామని చెప్పామని ఈ లోగా చంద్రబాబు ని అక్రమ నిర్బంధం చేశారని వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారి నిర్ణయం ప్రకటించి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యంగా జనసేన, టీడీపీ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ అధ్యక్షులు లోకేష్ రాజమహేంద్రవరం లో మొదటి సమావేశం నిర్వహించారని ఆ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో ఉన్న రెండు పార్టీల నాయకులు కార్యకర్తలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించాలని దానికి అనుగుణంగా ఈ నెల 29 ఆదివారం రోజున కాకినాడ వేదికగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ సీటీ అధ్యక్షుడు మళ్లిపూడి వీరు, జనసేన నాయకులు తలాటం సత్య, తదితరులు ఉన్నారు.
అరాచక పాలన పై పోరాటమే జనసేన, టీడీపీ లక్ష్యం…

