Political

అమేథీ, రాయబరేలీ రెండింటిలోనూ కాంగ్రెస్‌ విజయం సాధిస్తుంది… -కేసీ వేణుగోపాల్‌-

congress-flags_1619968652

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్‌ భారత కూటమిపై హర్షం వ్యక్తం చేసారు. తాము చెక్కుచెదరకుండా ఉన్నామని, విజయాన్ని సాదిస్తామని ధీమ వ్యక్తం చేసారు. మేము అమేథీ, రాయ్‌బరేలీలో గెలుస్తామని ఆయన చెప్పారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల అభిప్రాయాలను చూడవచ్చని, భారత కూటమికి అన్ని అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. బీ.జే.పీ. 150 సీట్లకు మించి గెలవదని రాహుల్‌గాంధీ చెప్పడాన్ని ప్రశ్నించగా, రాహుల్‌ వద్ద గణాంకాలు ఉన్నాయని, ఆయన దేశవ్యాప్తంగా పర్యటించారని, ఆయనకు ప్రజల పల్స్ తెలుసునని అన్నారు.

ఇదిలావుండగా, అమేథీ నుండి కాంగ్రెస్, భారత కూటమి అభ్యర్థి కే.ఎల్. శర్మ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అమేథీలో సంయుక్త ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ… మొదటి 4 దశల తర్వాత బీ.జే.పీ. ఓడిపోయిందని, 140 సీట్లు గెలుచుకోవడానికి కష్టపడుతుందని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.