అస్సాం జైలులో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబందించి అమృతపాల్ సింగ్ తల్లిదండ్రులు తమ కొడుకు కోసం ప్రచారం ప్రారంభించారు. ఖలిస్తానీ తీవ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలేను హతమార్చిన అమృతపాల్ సింగ్ గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీన మోగాస్ రోడ్ గ్రామంలో అరెస్ట్ చేసినట్లు సంభందిత అధికారులు తెలిపారు.
నెల రోజుల పాటు వేట సాగించిన తరువాత అరెస్టు చేయబడ్డాడని తెలిపారు. ఖలిస్తాన్ సానుభూతిపరుడు మార్చి 18న జలంధర్ జిల్లాలో వాహనాలను రూపురేఖలు మారుస్తూ పోలీసుల వలలో చిక్కుకున్నాడు. గత ఏడాది అమృత్పాల్ సింగ్, అతని మద్దతుదారులు కత్తులను, తుపాకులను చూపించి బారికేడ్లను ఛేదించుకుని అమృత్సర్ నగర శివార్లలోని పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డారు. స్టేషన్లోకి చొరబడి ఘర్షణకు దిగిన అజ్నాలా ఘటన తర్వాత పంజాబ్ పోలీసులు అణిచివేత చర్యలు చేపట్టారని వారు తెలిపారు.

