తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రజా గళం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆనంద్ రావు తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో భారీ జన సమూహం చేరుకుంది. వివిధ మండలాల నుంచి భారీగా తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. టి.డి.పి.-జనసేన ఉమ్మడి ప్రచారానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తొలిసారిగా అమలాపురంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారని స్థానిక నాయకులు తెలియజేస్తున్నారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో టి.డి.పి.- జనసేన విజయకేతం ఎగరేస్తామని ఆనందరావు అన్నారు.
అమలాపురంలో ప్రజా గళం బహిరంగా సభ…

