అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ లో సిద్ధం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అతిథిగా విచ్చేసారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుంటే వాళ్ళు నాయకులు కార్యకర్తలు మాత్రమే వాళ్ళకు ఓటు వేస్తారు కానీ సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి కి ఓటు వేస్తారని తెలిపారు.
ఫిబ్రవరి 3న జరిగే ఎన్నికల శంఖారావ సభ “సిద్ధం” సభ విజయవంతం చేయాలని అమలాపురం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో భారీగా తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. జరిగే ఎన్నికల్లో 175/175 సీట్లుతో వైస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్య నారాయణ, బొమ్మి ఇజ్రాయల్, చైర్మన్ రెడ్డి నాగేంద్ర మణి, వైస్ చైర్మన్ లు తిక్కిరెడ్డి వెంకటేష్, రుద్ర రాజు నాని రాజు. వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

