https://youtu.be/-tNjz7GUg54?si=nlOaQtHHjKop3inh
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజలను జన రంజికంగా పాలిస్తున్న ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. అభివృద్ధి సంక్షేమానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. కాకినాడ నగరంలో స్వతంత్రానికి పూర్వం నుండి ఉన్న కాకినాడ పోర్టు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గాను సుమారు 75 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 32 వేల గృహ నిర్మాణాలు చారిత్రక అభివృద్ధికి సజీవ సాక్ష్యంగా నిలబడుతున్నాయన్నాయని వంగా గీత వెల్లడించారు.

