శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి.-ఎస్.సి.పి. పార్టీ పింప్రి-చించ్వాడ్ యూనిట్ చీఫ్తో సహా నలుగురు ఎన్.సి.పి. నాయకులు పార్టీకి రాజీనామా చేసిన తరువాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గానికి చెందిన మరికొంత మంది నాయకులు రాజీనామా చేస్తారని బుధవారం ప్రకటించారు.
ఎన్.సి.పి. జాతీయ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ… 2024 లోక్సభ ఎన్నికలలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి. చాలా ఘోరంగా పనిచేసింది. ఆయనతో పాటు వెళ్లిన వాళ్లంతా ఓటమిని చూశారు. ఇప్పుడు అజిత్ పవార్తో అంటకాగితే వచ్చే ఎన్నికల్లో ఓడిపోవచ్చని ఆయనతో పాటు వెళ్లిన వారందరూ అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల ముందు చాలా మంది అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలను విడిచిపెట్టవచ్చు.

