పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రత్యేక హోదా అంశంపై టీ.డీ.పీ., వైఎస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. పోలవరం ప్రాజెక్టును, అమరావతి రాజధానిని పూర్తి చేసేందుకు అధికార టీ.డీ.పీ. కేంద్రాన్ని ఆశ్రయించగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీ కోరింది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రెండు పార్టీలు నిందలు వేసుకున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత వైఎస్సార్సీపీ హయాంలోనే కారణమని టీ.డీ.పీ. ఆరోపించగా, శాంతిభద్రతల పరిస్థితి దిగజారడానికి ప్రస్తుత ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ ఆరోపించింది.
ఇంతలో కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ టీ.డీ.పీ. పై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ… జే..డీ., వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీలు వరుసగా బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్లకు ప్రత్యేక హోదాను డిమాండ్ చేశాయని, అయితే విచిత్రంగా టీ.డీ.పీ. ఈ విషయంపై మౌనం వహించిందన్నారు.

