దళితులు, వెనుకబడిన తరగతులు మరియు గిరిజనుల రిజర్వేషన్లను బీ.జే.పీ. లాక్కోవాలని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ను తిప్పికొడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్పై తీవ్ర దాడి చేశారు. ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ నిరాధారమైన అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
10 ఏళ్లుగా ఈ దేశంలో బీ.జే.పీ. ప్రభుత్వం నడుస్తోంది, రెండుసార్లు పూర్తి మెజారిటీ వచ్చిందన్నారు. రిజర్వేషన్ను రద్దు చేయాలనే ఉద్దేశ్యం బీ.జే.పీ. కి ఉంటే ఈ పాటికి జరిగి ఉండేదని నొక్కి చెప్పారు. దేశంలోని దళిత, వెనుకబడిన, ఆదివాసీ సోదర సోదరీమణులకు బీ.జే.పీ. ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ ముట్టుకోలేరని నరేంద్ర మోదీ జీ హామీ ఇచ్చారని చెప్పారు.
ఎస్సీ/ఎస్టీ, ఓ.బీ.సీ. ల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దాడి చేస్తూనే వుందని మండి పడ్డారు. కర్ణాటకలో తమ ప్రభుత్వం వచ్చి 4 శాతం మైనారిటీ రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. వెనుకబడిన సమాజాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చిందని, గిరిజనులకు న్యాయం చేసేందుకు ఏనాడూ కృషి చేయలేదని అన్నారు.

