ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడి కార్యకర్తలు సమస్యలను పరిష్కరించాలే కాని వారికి పంచాయతీరాజ్ ఉద్యోగులకు మధ్య తగాదాలు పెట్టడం సమంజసంకాదని అంగన్వాడి రాష్ట్ర అధ్యక్షురాలు జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ. అబ్బిరెడ్డి రమణారెడ్డిని నిలదీశారు . శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను ప్రభుత్వ పట్టించుకోకపోగా జిల్లా పరిషత్ సీ.ఈ.వో. పర్యవేక్షణలో సచివాలయ సిబ్బంది జోక్యం చేసుకొని అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. తలుపు తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రంలో సరుకులను మాయం చేశారని ఆరోపించారు. సచివాల సిబ్బందితో అంగన్ వాడి పనులు చేయించడం మూలంగా ఇప్పటి వరకు అంగనవాడి కేంద్రాలకు వచ్చే పసి పిల్లలు భయపడి కేంద్రాలకు రావడం మానేసే ప్రమాదం ఉందని అన్నారు.
అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం అన్యాయం….

